హైదరాబాద్, జూలై 28: మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.30 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.22.22 కోట్ల లాభంతో పోలిస్తే 37 శాతం ఎగబాకింది.
అలాగే కంపెనీ విక్రయాలు 21 శాతం ఎగబాకి రూ.241.15 కోట్లకు చేరుకున్నాయి.