Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. ఓ విమాన ప్రయాణికుడికి జరిగిన నష్టానికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని 20 ఏండ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీనిపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆరు శాతం వడ్డీ ‘పే’ చేయాలని ఆదేశించింది. ఫిర్యాదు దారు, అతడి ముగ్గురు సభ్యులకు ఈ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.20 ఏండ్ల క్రితం 2003 డిసెంబర్ 18న తిరువనంతపురం నుంచి దిబ్రూగఢ్ వెళ్లేందుకు ఫిర్యాదుదారుడు (ప్రస్తుతం రిటైర్డ్ పీఎస్యూ బ్యాంక్ మేనేజర్), ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు టికెట్లు కొనుగోలు చేశారు. వారు. తిరువనంతపురం నుంచి చెన్నై, కోల్కతా మీదుగా దిబ్రూగఢ్ వెళ్లాల్సి ఉంది.
తిరువనంతపురం నుంచి 1.30 గంటల పాటు విమానం ఆలస్యంగా బయలుదేరడంతో చెన్నై నుంచి కోల్ కతా వెళ్లే విమానం మిస్ అయింది. దీంతో వీరికి ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు ప్రకారం బెంగళూరు మీదుగా కోల్ కతా వెళ్లేసరికి మరుసటి రోజు ఉదయం 19 గంటలైంది. ఢిల్లీ నుంచి కోల్ కతా మీదుగా దిబ్రూగఢ్ వెళ్లే మరో విమానంలో వారికి ప్రయాణ వసతి కల్పించింది. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సదరు విమాన సర్వీసు వాయిదా వేసిన ఎయిర్ ఇండియా.. తర్వాత ఆ సర్వీసును రద్దు చేసింది. మరుసటి రోజు అంటే 2003 డిసెంబర్ 20న సదరు ఫిర్యాదీ దారు, ఆయన కుటుంబ సభ్యులు దిబ్రూగఢ్కు చేరుకున్నారు.
తీవ్రమైన జాప్యంపై తాను చేసిన ఫిర్యాదులను ఎయిర్ ఇండియా ఆమోదించకపోవడంతో ఆ ఫిర్యాదు దారు.. జిల్లా వినియోగ దారుల ఫోరంలో కేసు వేస్తే 2011 సెప్టెంబర్ 30న సానుకూల తీర్పు వచ్చింది. దీనిపై ఇరుపక్షాలు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాయి. సాంకేతిక కారణాల వల్లే విమాన సర్వీసులు ఆలస్యం కావడం, దారి మళ్లించడం జరిగిందని, తమ ఫాల్ట్ ఏమీ లేదని ఎయిర్ ఇండియా వాదించింది. చివరకు ఈ కేసు జాతీయ వినియోగదారుల ఫోరం వద్దకు వెళ్లింది. దీనిపై పూర్తిగా విచారించిన తర్వాత ఫిర్యాదుదారుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీని ప్రకారం ఫిర్యాదు దారుడికి కేసు ఖర్చులు, ఆరుశాతం వడ్డీతోపాటు రూ.3.85 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.