న్యూఢిల్లీ, జూలై 21: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40.84 శాతం తగ్గి రూ.3,308 కోట్లకు పరిమితమైంది.
ఆదాయం తగ్గడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. కానీ, మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.3,132 కోట్లతో పోలిస్తే 5 శాతం అధికంగా నమోదైంది. ఆదాయం రూ.39,355 కోట్ల నుంచి రూ.32, 279 కోట్లకు తగ్గింది. నిర్వహణ ఖర్చు లు రూ.31,973 కోట్లకు తగ్గాయి.