హైదరాబాద్, ఫిబ్రవరి 3: మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.1,747 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,896.66 కోట్లతో పోలిస్తే 8 శాతం పడిపోయింది.
కంపెనీ ఆదాయం రూ.6,942.92 కోట్ల నుంచి రూ.7,983 కోట్లకు ఎగబాకింది. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.2.50 లేదా 250 శాతం మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది.