న్యూఢిల్లీ: ఆతిథ్య స్టార్టప్ ఓయోలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 50 లక్షల డాలర్ల (రూ.37 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఈక్విటీ షేర్ల జారీ, కంపల్సరీ కన్వర్టిబుల్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా ఓయోలో మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడులు పెట్టింది. రెగ్యులేటరీ సంస్థలకు సమర్పించిన ఫైలింగ్లో హాస్పిటాలిటీ చైన్ ఓయో వెల్లడించింది.
గత నెల 16న జరిగిన ఓయో అసాధారణ వార్షిక సమావేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. ఈక్విటీ షేర్ల జారీ, కంపల్సరీ కన్వర్టిబుల్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా 49,71,650 డాలర్ల పెట్టుబడులను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిపింది.