న్యూయార్క్ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు అందింది. గ్రేట్ రిజిగ్నేషన్కు అడ్డుకట్ట వేసేందుకు టెకీల వేతనాలను రెట్టింపు చేసేందుకు సన్నద్ధమైంది. ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.
గ్లోబల్ మెరిట్ బడ్జెట్ను రెండింతలు చేశామని, తమ కెరీర్ మధ్యలో ఉన్న వారికి వేతన పెంపు భారీగా ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్న నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ అందించింది.
కస్టమర్లు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయిందని, మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులకు తాము సిద్ధమయ్యామని ఈమెయిల్లో తెలిపారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఫిబ్రవరిలో కార్పొరేట్, టెకీలకు వేతనాలను రెట్టింపు చేసింది. టాప్ టాలెంట్ నియామకాలతో పాటు ప్రస్తుత ఉద్యోగులను కాపాడుకునేందుకు వేతనాల బడ్జెట్ను అమెజాన్ భారీగా పెంచింది.