న్యూఢిల్లీ, ఆగస్టు 1: నీట్ పేపర్ లీక్ చోటుచేసుకున్న క్రమంలో పరీక్ష సంబంధిత అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. లోక్సభలో బుధవారం, రాజ్యసభలో గురువారం ఈ బిల్లును ఆమోదించారు. ఈ మేరకు న్యాయ శాఖ శుక్రవారం ఒక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, పరీక్షల సమగ్రతను బలోపేతం చేసేందుకు కేంద్రం ఈ బిల్లును ఆమోదించినట్టు తెలిపింది.