న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నది. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసినవారికి ఫేమ్-2 కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నూతన స్కీమ్లను తీసుకొచ్చాయి. అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా భారత విపణిలో అడుగు పెట్టేసింది.
ఈ పరిస్థితుల్లో అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మేనేజ్మెంట్ అప్రమత్తం అయ్యింది. అన్ని మోడల్ కార్లను ఎలక్ట్రిక్ మోడ్లో తయారు చేస్తామని ప్రకటించింది. 2025 నాటికి విపణిలోకి కొత్త ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విడుదదల చేస్తామని వెల్లడించింది.
విద్యుత్ కార్లు, టూ వీలర్స్, త్రీ వీలర్స్ నడవడానికి అవసరమైన చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వెంటాడుతున్నది. ఈ తరుణంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా 5.30 లక్షల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. వచ్చే 8 ఏండ్లలో (2022-2030) ఇందుకోసం రూ.36 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
అన్ని సెగ్మెంట్లు, వేరియంట్ కార్లను విద్యుత్ కార్లుగా కన్వర్ట్ చేస్తామని తెలిపింది. ఇందుకు 2022 నాటికి ప్రణాళిక సిద్ధం చేస్తామని మెర్సిడెస్ బెంజ్ వ్యాఖ్యానించింది. కస్టమర్లు కూడా తమకు ఇష్టమైన మోడల్ కార్లను ఆప్ట్ చేసుకోవచ్చునన్నది.
వచ్చే పదేండ్లలో మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం పేరు కూడా మారనున్నది. పూర్తి ఎలక్ల్రిక్ కార్ల మార్కెట్కు అనుగుణంగా రూపాంతరం చెందనున్నది. సంస్థ సీఈవో ఓలా కెలెనియస్ మాట్లాడుతూ 2025 నాటికి కంబుష్టన్ ఇంజిన్ టెక్నాలజీపై వ్యయం పూర్తిగా జీరో చేస్తామన్నారు.
డామ్లియర్ సంస్థ తన ట్రక్ డివిజన్ను మూసివేయనున్నది. దానికి మెర్సిడెస్ బెంజ్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తున్నది.
Chanu Saikhom Mirabai | కట్టెలు మోసిన చేతులే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాయి
Tokyo Olympics: తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలో.. ఇండియన్ షూటర్లు ఫెయిల్
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
మీరాబాయి చాను కోచ్కు రూ.10 లక్షల నగదు బహుమతి
గోల్డ్ కోసం చాలా ప్రయత్నించాను కానీ..: మీరాబాయ్ చాను
Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్పై విజయం
Tokyo Olympics : ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్కు భారత్
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన