Tokyo Olympics 2020 | ఆమెకు బరువులు మోయడం కొత్త కాదు. ఒకప్పుడు కుటుంబం కడుపు నింపడానికి కట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్రజల ఆశల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను ( Chanu Saikhom Mirabai ) సిల్వర్ మెడల్ గెలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్లిఫ్టింగ్లో మెడల్ గెలిచిన తొలి అథ్లెట్గా మీరాబాయ్ నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్లో మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి బ్రాంజ్ మెడల్ గెలవగా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వర్తో మెరిసింది.