న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంలో కేసులో నిందితుడు మెహుల్ చోక్సీని పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్తుడేనని అంటిగ్వా ప్రధాని ధ్రువీకరించుకున్నారు. 2018లో దేశం విడిచి పారిపోయినప్పటి నుంచి అంటిగ్వాలోనే చోక్సీ తల దాచుకున్న సంగతి తెలిసిందే.
ఆయనను స్వదేశానికి తరలించేందుకు మెహుల్ చోక్సీ నేరాలకు సంబంధించిన పత్రాలతో భారత్ నుంచి దర్యాప్తు అధికారులతో ఓ ప్రత్యేక విమానం అంటిగ్వాకు చేరుకున్నది. అధికారులు సమర్పించిన నేరాల పత్రాలను అంటిగ్వా ప్రధాని పరిశీలించారు.
వాటిని పరిశీలించాక చోక్సీ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడే అని అంటిగ్వా ప్రధాని నిర్ణయానికి వచ్చారు. 2018లో పీఎన్బీ స్కాం వెలుగు చూడడంతో మరో ఆర్థిక నేరస్థుడు, తన మేనల్లుడు నీరవ్ మోదీతోపాటు చోక్సీ పరారయ్యాడు. 2017లో అంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు చోక్సీ.
మరోవైపు, అతడి అప్పగింత కోసం అంటిగ్వా-బార్బుడాపై భారత ప్రభుత్వం ఒత్తిళ్లు తీవ్రం అయ్యాయి. దీంతో క్యూబాకు పరారయ్యేందుకు యత్నించాడు. ఈ నెల 25న అంటిగ్వా నుంచి పారిపోయి దొంగ మార్గంలో డొమినికాకు చేరుకున్నాడు.
దీంతో అంటిగ్వా సర్కార్ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. డొమినికాలో చోక్సీని గుర్తించిన ఆ దేశ పోలీసులు ఆయనను అక్కడే అరెస్టు చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
న్యాయమూర్తి ఆదేశాల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చోక్సీకి కరోనా నెగెటివ్ వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు డొమినికా పోలీసులు చోక్సీని జైలుకు తరలించారు.
ఆయనను కటకటాల వెనుక నిర్బంధించిన ఓ చిత్రాన్ని స్థానిక మీడియా శనివారం బయటపెట్టింది. దీంతో చోక్సీని అరెస్టు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
జైలులో ఆయనను పోలీసులు చిత్రహింసలకు గురిచేసినట్లు చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఆరోపించారు. అందుకు సంబంధించి చోక్సీ శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు తెలిపారు.
తనని అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ చోక్సీ డొమినికా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రానున్నది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆయన అరెస్టు చట్టబద్ధమైందా.. కాదా.. తెలియనుంది.
మరోవైపు చోక్సీని భారత్కు అప్పగించేందుకు ఇటు భారత్, డొమినికాలతో చర్చిస్తున్నట్లు అంటిగ్వా ప్రధాని ఇటీవల తెలిపారు. డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించిన చోక్సీని నిర్భందించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అతడిని అటు నుంచి అటే భారత్కు పంపాలని డొమినికా ప్రభుత్వాన్ని కోరారు.
అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్పై రాహుల్గాంధీ ఫైర్
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…
IPL 2021: ఐపీఎల్ కోసం సీపీఎల్ షెడ్యూల్ మార్పు
మార్స్పై మేఘాలను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుతమైన ఫొటోలు
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో