Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.26 లక్షల కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్లలో బుల్లిష్ ధోరణి నెలకొంది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1658.15 పాయింట్లు (2.37 శాతం) లబ్ధి పొందాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో 969.55 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 71,483.75 పాయింట్ల ఆల్ టైం రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 1091.56 పాయింట్లు (1.54 శాతం) పుంజుకుని 71,605.76 పాయింట్ల ఆల్ టైం గరిష్టాన్ని తాకింది.
గతవారం ట్రేడింగ్లో భారత్ ఎయిర్టెల్ మినహా టాప్ -10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్పోసిస్ సహా తొమ్మిది స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,26,391.77 కోట్లు పెరిగింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.85,493.74 కోట్లు పుంజుకుని రూ.14,12,412.13 కోట్లకు దూసుకెళ్లింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.36,793.61 కోట్ల లబ్ధితో రూ.6,55,457.54 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,700.67 కోట్ల లాభంతో రూ.5,78,671.84 కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.26,386.16 కోట్లు పెరిగి రూ.16,88,173.26 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,493.9 కోట్లు పెరిగి రూ.7,27,330.82 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.14,294.5 కోట్లు పుంజుకుని రూ.5,03,722.82 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.387.69 కోట్లు పెరిగి రూ.5,92,801.88 కోట్ల వద్ద నిలిచింది.
మరోవైపు భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,654.15 కోట్ల నష్టంతో రూ.5,58,242.75 కోట్ల వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్ సంస్థగా రిలయన్స్ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఎల్ఐసీ నిలిచాయి.