Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,67,936.21 కోట్లు తగ్గిపోయింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,144.8 పాయింట్లు (1.57 శాతం0 నష్టపోయింది. ఈ నెల 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సాధారణ ట్రేడింగ్ నిర్వహించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ విక్రయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో వరుసగా మూడో రోజు శుక్రవారం 12 శాతానికి పైగా నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్ లో తిరిగి పుంజుకుని 0.54 శాతం లాభ పడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,199.35 కోట్లు నష్టపోయి రూ.18,35,665.82 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీలివర్ (హెచ్ యూఎల్) ఎం-క్యాప్ రూ.17,845.15 కోట్ల పతనంతో రూ.5,80,184.57 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,720.6 కోట్లు కోల్పోయి రూ.14,12,613.37 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.2,008.04 కోట్లు నష్టపోయి రూ.5,63,589.24 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని దాటేయడంతోపాటు దేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థగా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.26,380.94 కోట్లు పెరిగి రూ.6,31,679.96 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,170.75 కోట్లు పుంజుకుని రూ.6,84,305.90 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.3,163.72 కోట్లు పెరిగి రూ.7,07,373.79 కోట్ల వద్ద నిలిచింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.2,058.48 కోట్లు పుంజుకుని రూ.5,84,170.38 కోట్లకు పెరిగింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ఐసీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నిలిచాయి.