న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశీయ మార్కెట్లో గత నెల వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ఎగుమతులూ ఆశాజనకంగా ఉండటం గమనార్హం. దిగ్గజ సంస్థ మారుతీ అక్టోబర్ సేల్స్లో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ద్విచక్ర వాహన మార్కెట్ కూడా కళకళలాడింది.
ఎస్యూవీ, మిడ్ సెగ్మెంట్ కార్లకు డిమాండ్ బాగా కనిపించింది. పండుగలు కలిసొచ్చాయని చెప్తున్నారు.