అహ్మదాబాద్, డిసెంబర్ 6: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. వచ్చే ఏడాది తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది. సింగిల్ చార్జింగ్తో 550 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారును గుజరాత్ ప్లాంట్లో తయారు చేస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భర్తి ఈ సందర్భంగా తెలిపారు. 60 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ ఎస్యూవీ మాడల్ను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఈ ప్లాంట్ను ప్రారంభించినట్టు చెప్పారు. సుజుకీ మోటర్ కార్పొరేషన్తో కలిసి రూ.3,100 కోట్ల పెట్టుబడితో ఈవీలను తయారు చేయడానికి ప్రత్యేక యూనిట్ను నెలకొల్పిన విషయం తెలిసిందే.