Maruti Suzuki | న్యూఢిల్లీ, జనవరి 16: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ధరలను పెంచేసింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మాడళ్లను బట్టి ధరలు మరింత పెరగనున్నాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం సంస్థ రూ.3.54 లక్షలు మొదలుకొని రూ.28.42 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంభదించినవి. మరోవైపు, వోల్వో కార్ ఇండియా కూడా పలు మాడళ్ల ధరలను పెంచింది. ఇంటర్నల్ కంబూస్టిన్ ఇంజిన్(ఐసీజీ) ఇంజిన్ కలిగిన వాహన ధరలను 2 శాతం సవరించింది. దీంతో ఎక్స్సీ60 మాడల్ ధర రూ.68.9 లక్షలకు, ఎస్90 ధర రూ.68.25 లక్షలు, ఎక్స్సీ90 ధర రూ.1,00,89,000కి చేరుకున్నాయి.