Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,404.85 కోట్లు పెరిగింది. భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థలు భారీగా లాభ పడ్డాయి. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ రికార్డ్ బ్రేకింగ్ ర్యాలీ తర్వాత 3.32 శాతం నష్టంతో ముగిసింది. మంగళవారం 75,124.28 పాయింట్ల జీవితకాల గరిష్టానికి చేరుకున్న సెన్సెక్స్.. బుధవారం 75,038.15 పాయింట్ల ఆల్ టైం గరిష్టం వద్ద నిలిచింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,029.37 కోట్లు పెరిగి రూ.6,92,861.27 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.15,363.23 కోట్ల లాభంతో రూ.7,75,447.63 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.10,250.02 కోట్లు పుంజుకుని రూ.19,85,797.70 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.7,507.53 కోట్ల లబ్ధితో రూ.14,47,343.55 కోట్ల వద్ద నిలిచింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,809.06 కోట్లు లాభ పడి రూ.5,36,967.87 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.2,303.73 కోట్లు పెరిగి రూ.6,16,424.57 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,141.91 కోట్ల లాభంతో రూ.6,84,294.62 కోట్లకు చేరుకున్నది.
మరోవైపు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,170 కోట్లు నష్టపోయి రూ.11,53,894.76 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.13,440.62 కోట్ల పతనంతో రూ.6,14,252.15 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.8,153.08 కోట్ల నష్టంతో రూ.5,24,663.73 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ నిలిచాయి.