Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. కొద్దిసేపటికి మళ్లీ కోలుకొని చివరకు 60,280 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని చివరకు 60,130 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మంగళవారం బజాజ్ ట్విన్స్ షేర్లు రెండు శాతం పెరగ్గా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రెండు శాతం క్షీణించాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ఫ్లాట్గా 81.92 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్ సర్వీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉండగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్, యుపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా ఉన్నాయి. సెక్టార్ల వారీగా పవర్, పీఎస్యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం పెరిగాయి. మెటల్, ఇన్ఫ్రా, ఆయిల్, గ్యాస్, రియల్టీ 0.5 శాతం లాభపడ్డాయి.