Facebook : గతంలో ఫేస్బుక్ నుంచి వేటుకు గురైన వ్యక్తి సొంత కంపెనీ ఏర్పాటు చేసి ఏటా రూ. 27 కోట్లు ఆర్జిస్తున్నారు. 41 ఏండ్ల టెక్ ఔత్సాహికవేత్త నో కగన్ తన సక్సెస్ ప్రస్ధానాన్ని సీఎన్బీసీ మేక్ ఇట్స్ మిలీనియల్ మనీ సిరీస్లో పంచుకున్నారు. ఇజ్రాయల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన కగన్ టెక్ పరిశ్రమ ద్వారా సంపద కూడబెట్టాలని కలలు కనేవారు.
తాను మైక్రోసాప్ట్లో పనిచేయాలనుకున్నానని, అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని, ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరుకునేవాడినని చెప్పుకొచ్చారు. ఫేస్బుక్లో 2005లో ప్రోడక్ట్ మేనేజర్గా చేరిన కగన్ టెక్ ప్రపంచంలో పనిచేయాలనే కలను నెరవేర్చుకున్నారు. ఆపై కంపెనీ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారనే ఆరోపణలపై అతడు ఫేస్బుక్ను వీడాల్సి వచ్చింది.
ఫేస్బుక్, ఇంటెల్, మింట్.కాం వంటి టెక్ దిగ్గజాల్లో పనిచేసిన అనుభవంతో కగన్ తన సొంత డిస్కౌంట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్, యాప్సుమోను 2010లో ఏర్పాటు చేశారు. తొలి ఏడాది పెద్దగా లాభాలు తెచ్చిపెట్టని కంపెనీ ఆపై కగన్ కృషి, అంకితభావంతో కంపెనీ లాభాల బాట పట్టింది. గత ఏడాది యాప్సుమో ఏకంగా 80 మిలియన్ డాలర్ల రాబడితో ఏడు మిలియన్ డాలర్ల పైగా లాభం ఆర్జించింది. గత ఏడాది ఖర్చులన్నీ పోగా తాను లాభంలో వాటా కింద వేతనంగా రూ. 27 కోట్లు అందుకున్నానని కగన్ చెప్పుకొచ్చారు.
Read More :