న్యూయార్క్ : అమెరికాకు చెందిన మైఖేల్సన్ బీర్తో నడిచే బైక్ను ఆవిష్కరించాడు. గతంలో రాకెట్తో నడిచే టాయిలెట్, జెట్తో నడిచే కాఫీ పాట్ను కనుగొన్న మైఖేల్సన్ లేటెస్ట్ డిస్కవరీ పలువురిని ఆకట్టుకుంటోంది. బైక్లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ను 300 డిగ్రీల వరకూ మండిస్తుందని, దీంతో నాజిల్స్లో ఆవిరి జనరేట్ అవడంతో బైక్ ముందుకు కదులుతుందని మైఖేల్సన్ వివరించాడు.
ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుందని చెప్పాడు. తాను కనిపెట్టిన మోటార్సైకిల్ వినూత్న ఆవిష్కరణగా నిలుస్తుందని ఫాక్స్9తో మాట్లాడుతూ వెల్లడించాడు. గ్యాస్ ధర రోజురోజుకూ ఎగబాకుతున్నదని, తాను డ్రింక్ చేయనని, అందుకే దీన్ని ఇంధనంగా మలచి మెరుగ్గా వాడుకోవాలని ఆలోచించానని చెప్పుకొచ్చాడు.
రాకెట్మ్యాన్గా పేరొందిన మైఖేల్సన్ ఈ బైక్ను ఇంతవరకూ రోడ్డు మీదకు తీసుకువెళ్లలేదు. స్ధానిక కార్ షోస్లో పాల్గొన్న బీరుతో నడిచే వాహనం ఆ షోస్లో మొదటి స్ధానంలో నిలవడం విశేషం. కొన్ని ప్రదర్శనల అనంతరం తన ఇంటిలోని మ్యూజియంలో ఈ బైక్ను ఉంచుతానని మైఖేల్సన్ తెలిపాడు.
Read More