న్యూఢిల్లీ, జూలై 6: ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. దేశవ్యాప్తంగా 5వేలకుపైగా నియామకాలను చేపట్టనున్నది. రిటైల్ జ్యుయెల్లరీ సేల్స్, స్టోర్ ఆపరేషన్స్, అకౌంటెంట్స్ ఖాళీల భర్తీకి కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబైల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లో, కోజీకోడ్లోని ప్రధాన కేంద్రంలో పనిచేసేందుకు ఉద్యోగులు అవసరమున్నారని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా యోచిస్తున్నట్లూ చెప్పారు. కాగా, సగం ఉద్యోగాలను మహిళల కోసం కేటాయించినట్లు సంస్థ వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు సంస్థ ఆన్లైన్ జాబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.