హైదరాబాద్, మే 2: మహీంద్రాకు చెందిన వ్యవసాయ సాంకేతిక విభాగ సంస్థ కృష్-ఈ.. తెలంగాణ మార్కెట్లోకి కృష్-ఈ స్మార్ట్ కిట్ను విడుదల చేసింది. ఈ పరికరంతో రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు జీపీఎస్ ఆధారంగా ట్రాకింగ్, స్మార్ట్ఫోన్తో ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ రామచంద్రన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలి ఐవోటీ పరిష్కార పరికరం ఇదేనని, దీంతో వ్యవసాయదారులు మరింత సులభంగా తమ వ్యవసాయ ఉత్పత్తులను నిర్వహించవచ్చునన్నారు. ఈ ఉత్పత్తి ధర రూ.4,995గా నిర్ణయించింది.