Mahindra Q3 Results | ముంబై, ఫిబ్రవరి 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.2,658 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. మహీంద్రా అండ్ మహీంద్రా. అమ్మకాలు భారీగా పుంజుకోవడం వల్లనే క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,984 కోట్ల లాభంతో పోలిస్తే 34 శాతం వృద్ధిని కనబరిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.30,621 కోట్లుగా ఉన్న ఆదాయం గత త్రైమాసికానికి రూ.35,299 కోట్లకు చేరుకున్నది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ 2,11,443 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటితోపాటు లక్ష యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించింది.