న్యూఢిల్లీ, మార్చి 26: హైదరాబాద్ కేంద్రంగా విద్యా సేవలు అందిస్తున్న మహీంద్రా యూనివర్సిటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబ సభ్యులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఐదేండ్ల వరకు 2024-25 నుంచి 2028-29 వరకు ఈ పెట్టుబడులు పెట్టనున్నారు. వీటితోపాటు మహీంద్రా గ్రూపు చైర్మన్ ప్రత్యేకంగా రూ.50 కోట్లు మహీంద్రా యూనివర్సిటీకి అనుబంధ సంస్థయైన ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.