ముంబై, ఆగస్టు 4: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక పనితీరు కనబరిచింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభంలో 56 శాతం వృద్ధి నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం రూ.2,360.70 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.3,683.87 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
ఆటోమోటివ్ విభాగం అంచనాలకు మించి రాణించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.28, 412.38 కోట్ల నుంచి రూ.33,406. 44 కోట్లకు చేరుకున్నది. అటు నిర్వహణ ఖర్చులు కూడా రూ.26,195 కోట్ల నుంచి రూ.30,492.08 కోట్లకు చేరుకున్నాయి.