Benz Cars | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అంతక్రితం ఏడాది విక్రయించిన వాహనాలతో పోలిస్తే 10 శాతం పెరిగాయని మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ తెలిపారు.
కేవలం జనవరి-మార్చి మధ్యకాలంలోనే సంస్థ 5,412 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి మూడు ఈవీలతోపాటు మొత్తంగా తొమ్మిది వాహనాలను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే రెండు లగ్జరీ మార్ 20ఎక్స్ అవుట్లెట్లను న్యూఢిల్లీ, ముంబైలలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.