న్యూఢిల్లీ: లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఆ వెంటనే స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి వాయిదావేశారు. కాగా, ఈ 2022-23 బడ్జెట్ వేతన జీవులకు ఎలాంటి ఊరట కల్పించలేదు. పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ప్రకటించకుండా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. దాంతో వేతన జీవులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కేంద్ర సర్కారు గత ఏడేండ్లుగా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడంలేదు. అందుకే ఈసారైనా పన్ను శ్లాబులు మారుతాయని వేతన జీవులు ఎదురుచూశారు. కానీ కేంద్రం మాత్రం కేవలం ట్యాక్స్ రిటర్న్లలో లోపాల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించి సరిపెట్టింది. కాగా, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఈ ఉదయం 9.30 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు.
ఆనవాయితీ ప్రకారం బడ్జెట్కు సంబంధించిన వివరాలను దేశ ప్రథమ పౌరుడికి తెలియజేశారు. అనంతరం ఆమె పార్లమెంట్కు చేరుకున్నారు. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు.