న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మార్చిలో మార్కెట్లోకి రానుంది. ప్రభుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లతో మెగా ఐపీఓ దలాల్ స్ట్రీట్లో దుమ్ములేపనుంది. ఇష్యూ ధరపై ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారులకు నిబంధనల ప్రకారం రాయితీ ఇవ్వనున్నారు. ఐపీఓలో ఉద్యోగులు, పాలసీదారులకు ఎంతమేర రాయితీ ఇవ్వనుందనే వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
అయితే ఈ రాయితీలను పొందాలంటే ఎల్ఐసీ పాలసీదారులు ఈనెల 28లోగా ఎల్ఐసీ పాలసీలకు పాన్ నెంబర్ను విధిగా అనుసంధానించాల్సి ఉంది. ఎల్ఐసీ పాలసీలతో పాన్ లింకింగ్ దశలను పరిశీలిద్దాం. ఈ ప్రక్రియ ప్రారంభించేముందు ఎల్ఐసీ పాలసీదారులు తమ పాన్ కార్డును, పాలసీల జాబితాను సిద్ధం చేసుకోవాలి. ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి. ముందుగా LIC https://licindia.in/Home/Online-PAN-Registration వెబ్సైట్ పేజీకి వెళ్లాలి.
ఆపై అక్కడ కనిపించే ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయాలి. దీంతో లింక్ పాన్ విత్ యువర్ పాలసీ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. ఆ పేజీలో కనిపించే ఫాంలో పుట్టినతేదీ, జెండర్, ఈమెయిల్ ఐడీ, పాన్, మొబైల్ నెంబర్, పాలసీ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎంటర్ చేయాలి.