కొవిడ్ నేపథ్యంలో పాలసీలకు పెరిగిన ఆదరణ
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సంరక్షణ, జీవిత భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల కోసం ప్రభుత్వం రెండు బీమా పథకాలను అమలు చేస్తున్నది. అందులో ఒకటి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై), మరొకటి ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). కొవిడ్ నేపథ్యంలో వీటికి ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. అయితే వాటిని ైక్లెయిమ్ చేసుకోవడంపై అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయిలో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా చాలా మంది లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొంది. మరి బీమా తీసుకున్న వారు ఎలా ైక్లెయిమ్ చేసుకోవాలి? అధికారులు తిరస్కరిస్తే ఏమి చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ఇదీ..
ప్రభుత్వం అమలు చేస్తున్న పై రెండు పథకాల్లో ఎక్కువ మంది ప్రమాద బీమాకు సంబంధించిన పీఎంఎస్బీవై వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. వార్షిక ప్రీమియం రూ.12 వేలు మాత్రమే. ఈ పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.లక్ష అందిస్తారు. ఈ పాలసీని తీసుకునేందుకు 18- 70 ఏండ్లవారు అర్హులు. ఇక పీఎంజేజేబీవై పాలసీ జీవిత బీమాకు సంబంధించినది. వార్షిక ప్రీమియం రూ.330 మాత్రమే ఉండే ఈ పాలసీ తీసుకునేందుకు 18-50 ఏండ్లవారు అర్హులు. ఈ పాలసీదారు సహజ మరణం పొందినా వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా అందిస్తారు. అయితే పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై పాలసీలు తీసుకున్నవారిలో చాలా మంది వాటిని క్లెయిమ్ చేసుకోకపోతున్నారు. పాలసీ తీసుకున్నవారు ఆ సమాచారాన్ని ఇంట్లో తెలియజేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అదీగాక కొందరు బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ద్వారా పాలసీలను తీసుకుని వదిలేస్తున్నారు తప్ప సంబంధిత బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి నిర్దేశిత పత్రాలను ఇవ్వడం కానీ, పాలసీ నంబర్ తదితర విషయాలను తెలుసుకోవడం గానీ చేయడం లేదు. బ్యాంకు అధికారులు సైతం పాలసీ ప్రీమియంను కట్ చేసుకుంటున్నారు తప్ప తదుపరి పూర్తిచేయాల్సిన తతంగాన్ని గాలికి వదిలేస్తున్నారు. దీంతో బీమా సాయం అందక పాలసీదారులు నష్టపోతున్నారు.
సంవత్సరం నమోదు ైక్లెయిమ్ క్లియర్
చేసుకున్నవారు దరఖాస్తులు అయినవి
2018-19 5.92 కోట్లు 1,45,763 1,35,212
2019-20 6.96 కోట్లు 1,90,175 1,78,189
2020-21 10.27 కోట్లు 2,50,351 2,34,905
నోట్: 2020-21కు సంబంధించిన వివరాలు
2021 మార్చి 31 నాటి వరకే)
సంవత్సరం నమోదు ైక్లెయిమ్ క్లియర్
చేసుకున్నవారు దరఖాస్తులు అయినవి
2018-19 15.47కోట్ల మంది 40,749 32,176
2019-20 18.54కోట్ల మంది 50,328 39,969
2020-21 23.26కోట్ల మంది 58,540 45,472