న్యూఢిల్లీ, మార్చి 9: జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్ళు ఏకంగా 21% పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఐఆర్డీఏఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న 24 జీవిత బీమా సంస్థలు గతేడాది రూ.18,533.19 కోట్ల మేర వసూలు చేశాయి. వీటిలో బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన ప్రీమియం వసూళ్ళు ఏడాది ప్రాతిపదికన 24.18 శాతం పెరిగి రూ.12,920.57 కోట్లకు చేరుకున్నాయి. మిగతా 23 సంస్థలు సంయుక్తంగా రూ.9,504.64 కోట్ల మేర వసూలు చేశాయి.