న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 50 శాతం తగ్గి రూ.7,925 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. 2022-23 ఏడాది రెండో త్రైమాసికంలో సంస్థ రూ.15,952 కోట్ల లాభాన్ని గడించిన విషయం తెలిసిందే. గత త్రైమాసికంలో సంస్థకు ప్రీమియం వసూళ్ల ద్వారా రూ.1,07,397 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాది క్రితం వచ్చిన రూ.1,32,631.72 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,22,215 కోట్ల నుంచి రూ.2,01,587 కోట్లకు పడిపోయినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఆరు నెలల్లో నాన్-పార్ ఉత్పత్తులను వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టాం. ప్రస్తుత వాల్యు ఆఫ్ న్యూ బిజినెస్(వీఎన్బీ) మార్జిన్లు ఒత్తిడికి గురైనప్పటికీ లాభాల్లోనే కొనసాగాం.
– సిద్ధార్థ మోహంతీ, ఎల్ఐసీ చైర్మన్