న్యూఢిల్లీ, మే 16: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళశారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడవుతాయి. కేంద్రం ఎల్ఐసీలో 22.13 కోట్ల షేర్లను (3.5 శాతం) ఐపీవోలో విక్రయించి రూ.20,557 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్లకు కేటాయించే షేర్లకు ఒక్కోదానికి రూ.949 ధరను నిర్ణయించింది. ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్తో రూ.889 ధరపై షేర్లను కేటాయించగా, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్తో రూ.904 ధరతో షేర్లను అలాట్ చేశారు. 3 రెట్లు ఓవర్ సబ్స్ర్కైబైన ఈ ఇష్యూ మే 9న ముగిసింది.