న్యూఢిల్లీ : భారత్లో అతిపెద్ద ఐపీఓను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) బుధవారం ప్రకటించింది. మేలో మెగా ఐపీఓ మార్కెట్లోకి రానుందని సంస్ధ వెల్లడించింది. ఎల్ఐసీ ఐపీఓలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించి రూ 20,557 కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది.
ఇప్పటివరకూ 2021లో వచ్చిన పేటీఎం ఐపీఓ రూ 18,300 కోట్లు సమీకరిస్తూ దేశంలో అతిపెద్ద ఐపీఓగా నమోదైంది. ఇక అంతకుముందు 2010లో కోల్ ఇండియా రూ 15,500 కోట్లు, రిలయన్స్ పవర్ 2008లో రూ 11,700 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించాయి. ఇక ఎల్ఐసీ మెగా ఐపీఓ సబ్స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది.
ఐపీఓ ధరల శ్రేణిని ఎల్ఐసీ షేర్ ఒక్కింటికి రూ 902-949గా నిర్ధారించింది. 15 షేర్లతో కూడిన లాట్ను ఖరారు చేసింది. ఇష్యూ సైజ్లో పది వాతం షేర్లను పాలసీదారులకు కేటాయించిన ఎల్ఐసీ 0.7 శాతం షేర్లను తమ ఉద్యోగులకు కేటాయించింది. పాలసీదారులకు రూ 60 డిస్కౌంట్ను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. ఎల్ఐసీ ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ 40 డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది.