న్యూఢిల్లీ, మా ర్చి 11: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇంచార్జి చైర్మన్గా సిద్ధార్థ మహంతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న మహంతీ ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం చైర్మన్గా వ్యహరిస్తున్న ఎంఆర్ కుమార్ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించలేదు. ఎల్ఐసీ ఎండీలుగా బిష్ణు చరణ్ పట్నాయక్, ఇపే మినీ, సిద్దార్థ మహంతి, రాజ్కుమార్లు వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద బీమా సేవల సంస్థకు 13 లక్షల మంది ఏజెంట్లు ఉండగా, 27.80 కోట్ల పాలసీలను విక్రయించింది.