హైదరాబాద్, అక్టోబర్ 20: లారస్ ల్యాబ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 84.1 శాతం తగ్గి రూ.37.12 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికిగాను సంస్థ రూ.233.39 కోట్ల లాభాన్ని గడించింది.
అటు ఆదాయం కూడా 22.3 శాతం తగ్గి రూ.1,224 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, ప్రతిషేరుకు 40 పైసలు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఆర్అండ్డీ కోసం రూ.58 కోట్ల నిధులు వెచ్చించినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు అంచనావేసినట్టుగానే ఉన్నాయని కంపెనీ ఫౌండర్, సీఈవో సత్యనారాయణ చావా తెలిపారు.