హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 5 నుంచి 11 వరకు హైదరాబాద్లో ఈ-మొబిలిటీ వీక్ జరగనున్నది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ-మొబిలిటీ వీక్పై మాట్లాడారు. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) విభాగంలో తెలంగాణ తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీని ప్రారంభించిన రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉందని గుర్తుచేశారు. ఈవీల రంగంలో ఆకర్షణీయమైన పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈవీల వినియోగాన్ని పెంచేలా కృషి చేస్తున్నట్టు వివరించారు.
గ్లోబల్ హబ్గా మారాలి..
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థల తయారీకి గ్లోబల్ హబ్గా తెలంగాణ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ-మొబిలిటీ వీక్ను తెలంగాణలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కల్పించిందని తెలిపారు. వారి కార్యకలాపాలు సులభతరంగా జరిగేలా ఇక్కడ అన్ని వసతులున్నాయన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్ రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలికేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ-మెబిలిటీ వీక్ జరుపుతున్నదని వివరించారు.
ఈ-మొబిలిటీ వీక్ షెడ్యూల్ ఇలా..