Kotak Mahindra Bank | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘కోటక్ మహీంద్రా బ్యాంక్’ కన్సాలిడేటెడ్ నికర లాభంలో దాదాపు 8 శాతం గ్రోత్ నమోదు చేసింది. మార్కెట్ అంచనా వేసిన రూ.3,250 కోట్ల కంటే తక్కువగా రూ.3,005 కోట్లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం పరిమితమైంది. ఇక నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16 శాతం పెరిగి రూ.6,553 కోట్లకు పెరిగింది.
గతేడాది డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే స్థూల మొండి బకాయిలు తగ్గాయి. 2022-23 డిసెంబర్ త్రైమాసికంలో 1.90 శాతం స్థూల మొండి బకాయిలు ఉంటే, ఈ ఏడాది 1.73 శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ త్రైమాసికం స్థూల మొండి బకాయిలు 1.72 శాతంగా నమోదు కావడం గమనార్హం. నికర మొండి బకాయిలు 2022-23 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 0.43 శాతం నుంచి 0.34 శాతానికి దిగి వచ్చాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 0.37 శాతంగా నికర మొండి బకాయిలు నిలిచాయి. అన్ సెక్యూర్డ్ రిటైల్ రుణాల శాతం 9.3 నుంచి 11.6 శాతానికి పెరిగింది.