న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చార్జీలు రూ.259కి పెరుగుతాయి. దీనిపై జీఎస్టీ అదనం’ అని అందులో బ్యాంక్ పేర్కొన్నది.
ప్రస్తుతం 199, జీఎస్టీ పడుతున్నది. దీంతో చార్జీల భారం రూ.60 పెరుగుతున్నట్టవుతున్నది. కాగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలను ఆఫర్ చేస్తున్నది. అలాగే ఖాతా, పరిమితి, ఫీచర్ల ఆధారంగా డెబిట్ కార్డులనూ జారీ చేస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు కస్టమర్లకు చార్జీల పెంపు సందేశాలు వెళ్లాయి.