న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో కియా సోనెట్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ను కియా ఇండియా లాంఛ్ చేసింది. పండగ సీజన్ పురస్కరించుకుని వినూత్న డిజైన్తో ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులతో ఈ ఎస్యూవీ కస్టమర్లను ఆకట్టుకోనుంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్స్లో లభించే యానివర్సరీ ఎడిషన్ ప్రారంభ ధర రూ 10.79 లక్షలు (ఎక్స్షోరూం-ఇండియా)గా కంపెనీ వెల్లడించింది.
తమ కస్టమర్లకు ప్రీమియం డ్రైవింగ్ అనుభూతి కలిగించేందుకు యూనిక్ డిజైన్తో యూనివర్సరీ ఎడిషన్ సోనెట్ను తీర్చిదిద్దామని కియా ఇండియా ఎండీ, సీఈఓ టిజిన్ పార్క్ వెల్లడించారు. కియా సోనెట్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ నాలుగు పవర్ట్రైన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉండగా అరోరా బ్లాక్ పెర్ల్, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్టీల్ సిల్వర్, గ్రావిటీ గ్రే వంటి నాలుగు కలర్స్లో లభిస్తుంది.