Joyalukkas | బెంగళూరు, ఏప్రిల్ 6: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయా లుక్కాస్ ఉగాది పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 10 వరకు అమల్లో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై అంతే బరువుగల వెండిని ఉచితంగా అందిస్తుంది.
ఈ ఆఫర్లు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న షోరూంలలో లభించనున్నదని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ అన్నారు.