హైదరాబాద్, ఏప్రిల్ 2: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి నెలలో తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 2.59 లక్షల మంది కస్టమర్లు చేరారు. ఈ విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దీంతో జియో వినియోగదారుల సంఖ్య 3.24 కోట్లకు చేరుకున్నారు.
మరోవైపు, ఎయిర్టెల్ కొత్తగా 1.18 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు చేరారు. కానీ, వొడాఫోన్ ఐడియా నుంచి 44,649, బీఎస్ఎన్ఎల్ నుంచి 16,146 మంది వినియోగదారులను కోల్పోయారు. అలాగే దేశవ్యాప్తంగా అత్యధికంగా 41.78 లక్షల మంది జతకావడంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకున్నారు.