న్యూఢిల్లీ, అక్టోబర్ 16: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జూలై-సెప్టెంబర్లో కంపెనీ నికర లాభం రెండింతలు పెరిగి రూ.668.18 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం రూ.331.92 కోట్లే. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 47 శాతం ఎగబాకి రూ.414.13 కోట్ల నుంచి రూ.608.04 కోట్లకు చేరుకున్నది.