హైదరాబాద్: రిలయన్స్ జియో.. రాష్ట్రంలో మరో రెండు నగరాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో 5జీ సేవలు అందిస్తున్న సంస్థ.. తాజాగా నిజామాబాద్, ఖమ్మంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లలో కాకినాడా, కర్నూల్తోపాటు అసోం(ఒకటి), కర్ణాటక(ఐదు నగరాలు), కేరళ(నాలుగు), తమిళనాడు(ఒకటి), ఉత్తరప్రదేశ్(ఒకటి)లో ఈ నూతన సేవలను ఆరంభించింది. దీంతో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందించే నగరాల సంఖ్య 134కి చేరుకున్నది.