హైదరాబాద్, నవంబర్ 10: 5జీ సేవలకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టెలికం వినియోగదారులకు శుభవార్తను అందించింది రిలయన్స్ జియో. హైదరాబాద్తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను గురువారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా కస్టమర్లకు జియో వెల్కమ్ ఆఫర్ కింద అన్లిమిటెడ్ 5జీ డాటాను 1జీబీపీఎస్ వేగంతో అందిస్తున్నది. అదనంగా రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సంస్థ ఆరు నగరాల్లో లక్షకు పైగా వినియోగదారులు ఈ సేవలు పొందుతున్నారు.