న్యూఢిల్లీ, జూన్ 7: మారుతి సుజు కీ..దేశీయ మార్కెట్కు ఐదు డోర్లు కలిగిన ఎస్యూవీ జిమ్నీని పరిచయం చేసింది. ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షల మధ్యలో లభించనున్నది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభాగంలో తొలి స్థానంపై దృష్టి సారించిన మారుతి..
అందుకు తగ్గట్టుగానే ఈ నూతన మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఫోర్-వీల్ డ్రైవ్ మాన్యువల్ మాడల్ రూ.12.74 లక్షల నుంచి రూ.13.85 లక్షల లోపు, ఆటోమోటిక్ మాడల్ రూ.13.94 లక్షల నుంచి రూ.15.05 లక్షల లోపు ధరను నిర్ణయించింది.