ముంబై, నవంబర్ 17: అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జీప్.. భారతీయ మార్కెట్కు గురువారం గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధర రూ.77.5 లక్షలు. ఈ ఐదో తరం 5 సీటర్ ఎస్యూవీలో 110కిపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లుండటం గమనార్హం. ఇందులో యాక్టీవ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏస్) కూడా ఉన్నది.
అలాగే 8 ఎయిర్బ్యాగులు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్బెల్ట్తోపాటు వాహనంలోని ప్రయాణీకులందరి కోసం ఆక్యుపెంట్ డిటెక్షన్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసినట్టు ఈ సందర్భంగా జీప్ వివరించింది. అంతేగాక 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ను అమర్చినట్టు తెలిపింది. కాగా, ఎంపిక చేసిన డీలర్షిప్లలో మాత్రమే ఈ గ్రాండ్ చెరోకీ అందుబాటులో ఉండనున్నది. బుకింగ్ చేసుకున్నవారికి ఈ నెలాఖరు నుంచి డెలివరీలుంటాయి.