ITR Filing | గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగించబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఒకవేళ ఆదివారం అర్ధరాత్రిలోపు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయకపోతే సోమవారం నుంచి రూ.5000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 వరకు ఫైన్తో ఐటీఆర్ సబ్మిట్ చేయొచ్చు. వేతన జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్) ఐటీఆర్లు దాఖలు చేయడానికి జూలై 31 తుది గడువు. ఇదిలా ఉంటే, శనివారం (జూలై 30) నాటికి 5.10 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి. శనివారం ఒక్కరోజే 57.71 లక్షల మందికి పైగా ఐటీఆర్లు సబ్మిట్ చేశారని ఐటీ విభాగం ట్వీట్ చేసింది.
ఆదివారం గడువు ముగిసేలోపు మొత్తం ఐటీఆర్లు దాఖలు చేసిన వారి సంఖ్య మరింత పెరుగుతుందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లో ఐటీఆర్ సబ్మిట్ చేయడానికి గడువు పొడిగించడానికి కేంద్రం నిరాకరించింది.
మీరు ఐటీఆర్ ఇప్పటికే దాఖలు చేసి ఉంటే మంచిది. ఒకవేళ దాఖలు చేయకుంటే వెంటనే పని పూర్తి చేయండంటూ ట్విట్టర్ వేదికగా ఇన్కం టాక్స్ విభాగం తెలిపింది. కానీ, కొందరు పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులు మాత్రం చివరిక్షణంలో కేంద్రం గడువు పొడిగిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. పన్ను చెల్లింపుదారులు eportal.incometax.gov.in అనే ఈ-ఫైలింగ్ పోర్టల్కు వెళ్లి ఉచితంగా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు.
More than 5.10 crore ITRs have been filed till 30th July,2022. Over 57.51 lakh #ITRs were filed on 30th July,2022 itself.
Do remember to file yours, if not filed as yet. #FileNow to avoid late fee.
Today is the due dt to file #ITR for AY 2022-23
Pl visit: https://t.co/GYvO3n9wMf pic.twitter.com/3bVrHid1MF— Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022