న్యూఢిల్లీ, జూలై 24: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 30.24 శాతం వృద్ధితో రూ. 3,343 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 2,567 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదాయం 36 శాతం పెరిగి రూ. 14,240 కోట్లకు పెరిగినట్లు కంపెనీ శనివారం తెలిపింది.