ముంబై, ఫిబ్రవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్ల విలువ గరిష్ఠంగా 7 శాతం వరకు పడిపోయింది. ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్.. ఎండ్-టు-ఎండ్ వర్క్ఫ్లో ఆటోమెషన్ ప్రొడక్టివిటీ టూల్ను ఆవిష్కరించడంతో భవిష్యత్ ఐటీ రంగ వృద్ధి అవకాశాలపై మదుపరులలో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి.
ఏఐ క్లౌడ్లో వేగంగా వస్తున్న ఈ మార్పులు.. సంప్రదాయ సాఫ్ట్వేర్ వ్యాపార విధానాలను, కంపెనీల లాభాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి మరి