హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రామ్కీ గ్రూప్ కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇండ్లు, ఫ్లాట్లు తదితర 18చోట్ల ఒకేసారి దాడులు జరిగాయి. గచ్చిబౌలీలోని రామ్కీ కేంద్ర కార్యాలయంతోపాటు బ్రాంచీలలో మంగళవారం ఉదయం నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను, డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడిటింగ్ ఖాతాల్లో సంస్థ నష్టాలు చూపినా.. షేర్ల విలువ పరుగులు పెట్టడంపై సెబీకి అవకతవకలు జరిగాయా? అన్న అనుమానం వచ్చింది. ఐటీ శాఖకు సమాచారమిచ్చింది. ఏప్రిల్ 22న రామ్కీ షేర్ల విలువ రూ.60 ఉండగా, అదిప్పుడు రూ.190కి పెరిగింది. కాగా, రామ్కీ ఓ మలేషియా కంపెనీ ఖాతాలోకి అడ్డదారిలో నిధులను తరలించినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం.