న్యూఢిల్లీ : ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్కు చెందిన లింక్డిన్ తన ఇంజనీరింగ్, ప్రోడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన 668 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవల వ్యాపార పునర్వ్యవస్ధీకరణ పేరుతో 5000 మంది ఉద్యోగులను తొలగించింది.
గత రెండేండ్లుగా ఎడాపెడా మాస్ లేఆఫ్స్కు టెక్ దిగ్గజాలు తెగబడుతుండగా ఈ ట్రెండ్ కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రతి గంటకూ 23 మంది టెకీలు కొలువులు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 2120 టెక్ కంపెనీలు 4,04,962 మంది టెకీలను సాగనంపాయని లేఆఫ్.ఎఫ్వైఐ డేటా తెలిపింది.
2022లో 1061 టెక్ కంపెనీలు 164,769 మంది ఉద్యోగులపై వేటు వేయగా 2023లో 1059 కంపెనీలు అక్టోబర్ 13 వరకూ 240,193 మంది ఉద్యోగులను తొలగించాయి. గత రెండేండ్లుగా ప్రతిరోజూ సగటున 555 మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతున్నారు. 2022లో ప్రారంభమైన కొలువుల కోత 2023 ఆరంభానికి పీక్స్కు చేరి ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఇంకా లేఆఫ్స్ ట్రెండ్ పూర్తిగా సమసిపోలేదు. కేవలం గతనెలలోనే ఆర్ధిక మందగమనం కారణంగా 4632 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.
Read More :
Kundara Johny | చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి